Friday 11 March 2016

తిరుమల శ్రీవారికి విశాఖ శ్రీనివాసులు కోటి రూపాయల కానుక

lord venkateswaraఅఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారికి కానుకలకు కొదవలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు శ్రీవారికి కోట్ల రూపాయలు కానుకలుగా అందిస్తుంటారు. స్వామివారికి శుక్రవారంనాడు ఉదయం విశాఖపట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు కోటి రూపాయల డిడిని అందజేశారు. 
 
టిటిడి పాలకమండలి చైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తిని తిరుమలలోని ఆయన కార్యాలయంలో కలిసి డిడిని అందజేశారు శ్రీనివాసులు. శ్రీవారి భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంతో పాటు టిటిడికి సంబంధించిన పలు కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించాల్సిందిగా దాత టిటిడి చైర్మన్‌ను కోరారు.

No comments:

Post a Comment