Saturday 26 March 2016

తెలంగాణలో గ్రూప్‌-2 & కానిస్టేబుల్‌ పరీక్షలు వాయిదా...........

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా
* ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలు కూడా..హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 23, 24న జరగాల్సిన ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌బీ పరీక్షల దృష్ట్యా ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. కానిస్టేబుల్‌ పరీక్ష ఏప్రిల్‌ 3న జరగాల్సి ఉంది. ఎస్‌ఐ పరీక్షలో ఇంగ్లిష్‌ పేపర్‌కు వెయిటేజీ నిబంధనను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర నియామక పరీక్షలు జరపవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. 
* ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు వెల్లడిస్తాం
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనతోనే గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment