Friday 13 May 2022

Assam Rifles Recruitment: 1380 పోస్టులు

 షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా.. గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1380
ఖాళీల వివరాలు: బ్రిడ్జ్‌–రోడ్‌–17, క్లర్క్‌–287, రిలీజియన్‌ టీచర్‌–09,ఆపరేటర్‌ రేడియో అండ్‌ లైన్‌–729, రేడియో మెకానిక్‌–72,ఆర్మౌరర్‌–48, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌లు–13, నర్సింగ్‌ అసిస్టెంట్‌లు–100, వెటర్నరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు–15,ఆయా(పారా మెడికల్‌)–15, వాషర్‌మెన్‌–80.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.assamrifles.gov.in/

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) 3614 పోస్టులు

 ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3614
సెక్టార్ల వారీగా ఖాళీలు: నార్తర్న్‌ సెక్టర్‌–209, ముంబై సెక్టర్‌–305, వెస్టర్న్‌ సెక్టర్‌–1434, ఈస్టర్న్‌ సెక్టర్‌–744, సదరన్‌ సెక్టార్‌–694, సెంట్రల్‌ సెక్టర్‌–228.
ట్రేడులు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), కోపా తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: ట్రేడ్‌ అప్రెంటిస్‌లకు మొదటి ఏడాది నెలకు రూ.7700, రెండో ఏడాది నెలకు రూ.8050, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2022

వెబ్‌సైట్‌: http://www.ongcindia.com/





ఎస్‌బీఐలో 35 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు


 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: రెగ్యులర్‌ పోస్టులు–07: సిస్టమ్‌ ఆఫీసర్లు(టెస్ట్‌ ఇంజనీర్, వెబ్‌ డెవలపర్, సీనియర్‌ ఆటోమేషన్‌ టెస్ట్‌ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌) ఒప్పంద పోస్టులు–28: ఎగ్జిక్యూటివ్‌(టెస్ట్‌ ఇంజనీర్, ఇంటరాక్షన్‌ డిజైనర్, వెబ్‌ డెవలపర్, పోర్టల్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌)
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌ /ఎంఈ /ఎంటెక్‌/ఎమ్మెస్సీ /ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలñ డ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 32 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.05.2022
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 25.06.2022

వెబ్‌సైట్‌: https://sbi.co.in

ఎస్‌ఈసీఆర్‌లో 1033 పోస్టులు..

మొత్తం ఖాళీల సంఖ్య: 1033
విభాగాల వారీగా ఖాళీలు: డీఆర్‌ఎం ఆఫీసర్, రాయ్‌పూర్‌ డివిజన్‌–696, వేగన్‌ రిపేర్‌ షాప్, రాయ్‌పూర్‌–337.
ట్రేడులు: వెల్డర్,టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్,హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్‌ డీజిల్, మెకానికల్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.
అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:24.05.2022

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in​​​​​​​


కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు

 

మొత్తం పోస్టుల సంఖ్య: 1920

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:13.06.2022

వెబ్‌సైట్‌: https://ssc.nic.in

TS SPDCL 1271 jobs

 

TS SPDCL 1271 jobs: సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

 

 సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

    మొత్తం ఖాళీలు: 1271
    • అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్- 70
    • సబ్ ఇంజనీర్/ఎలక్ట్రికల్- 201
    • జూనియర్ లైన్ మెన్- 1000

    ముఖ్య సమాచారం:
    • అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్‌ చేసి ఉండాలి.
    • పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ విడుదల: మే 11, 2022
    • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: మే 11, 2022
    • వెబ్‌సైట్‌:https://tssouthernpower.cgg.gov.in/

    Monday 2 May 2022

     

    పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

    భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
    india post recruitment 2022

    మొత్తం పోస్టుల సంఖ్య: 38926

    తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: 
    తెలంగాణ: 1226. 
    ఆంధ్రప్రదేశ్‌: 1716.

    పోస్టుల వివరాలు ఇలా..: బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌. 

    అర్హతలు: 
    పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. 

    వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

    జీతభత్యాలు ఇలా..:
    ☛ టైం రిలేటెడ్‌ కంటిన్యూటీ అలవెన్స్‌ (టీఆర్‌సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. 
    ☛ బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. 
    ☛ ఏబీపీఎం/డాక్‌సేవక్‌ పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు. 

    ఎంపిక విధానం ఇలా..:
    ☛ పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. 

    ☛ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
    ☛ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022
    ☛ దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022
    పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ https://indiapostgdsonline.gov.in/

    Sunday 1 May 2022

    TSPSC గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ శాఖలవారీగా పోస్టులు

     

    వివిధ శాఖల్లో మొత్తం 503 పోస్టుల భర్తీ 





    •      రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇదే తొలిసారి.. వచ్చేనెల 2 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ 
    •      రెండంచెల పరీక్ష విధానంతో అర్హుల ఎంపిక.. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ 
    •      నవంబర్‌ లేదా డిసెంబర్‌లో మెయిన్స్‌ 
    •      తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో పరీక్షలు 

    సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మంగళవారం గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి.. కార్యదర్శి అనితారామచంద్రన్, కమిషన్‌ సభ్యులతో కలిసి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలంటే గ్రూప్‌–1 ఉద్యోగాలే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. సోమవారం 16 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడగా...తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

    టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో 503 పోస్టులలో దాదాపు పావు వంతు అంటే 121 పోస్టులు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కొలువులే. రాష్ట్రంలో జిల్లాల పునరి్వభజన ప్రకియలో భాగంగా కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీడీఓ పోస్టుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత స్థానంలో వరుసగా డీఎస్పీ (91) సీటీవో (48), డిప్యూటీ కలెక్టర్‌ (42), మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2 (41), అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ (40), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (38) పోస్టులున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ పోస్టుల్లో 95 శాతం స్ధానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. యూనిఫాం ఉద్యోగాల కనిష్ట, గరిష్ట వయోపరిమితి 21 సంత్సరాల నుంచి 31 సంవత్సరాలుగా, ఇతర ఉద్యోగాల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలుగా నిర్దేశించారు. 

        ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మే 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో మే 31వ తేదీ వరకు స్వీకరిస్తారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఒన్‌టైమ్‌ రిజి్రస్టేషన్‌ (ఓటీఆర్‌) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. గ్రూప్‌–1 ఉద్యోగాలను రెండు అంచెల్లో భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలను తొలగించడంతో ఈ మేరకు పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ప్రిలిమ్స్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌), మెయిన్స్‌ (రాత పరీక్ష) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ను జూలై/ఆగస్టులో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లో వెల్లడించింది. అదేవిధంగా మెయిన్స్‌ పరీక్షలను నవంబర్‌/డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 

    ఇ–ప్రశ్నపత్రం 

        గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షల్లో ముద్రించిన ప్రశ్ర పత్రాల స్థానంలో ఎల్రక్టానిక్‌ ప్రశ్న పత్రం (ఇ– క్వశ్చన్‌పేపర్‌)ను ప్రవేశ పెట్టనున్నారు. అభ్యర్థుల ఎంపిక విధానంలో సాంకేతిక మూల్యాంకనం (డిజిటల్‌ ఎవాల్యూయేన్‌) ప్రవేశపెడుతున్నారు.  మరిన్ని వివరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 


    వయోపరిమితి సడలింపు ఇలా... 
        గ్రూప్‌–1 ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి జనరల్‌ పోస్టులకు 44 సంవత్సరాలు, యూనిఫాం పోస్టులకు 31 సంవత్సరాలుగా ఉంది.  ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. 

    దరఖాస్తు రుసుం రూ.200 

    గ్రూప్‌–1 ఉద్యోగ దరఖాస్తు ప్రాసెసింగ్‌ ఫీజును రూ.200గా నిర్ణయించారు. పరీక్ష ఫీజు కింద అదనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యోగులు, డిక్లరేషన్‌ సమరి్పంచే నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఫీజులను ఆన్‌లైన్‌ పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. 

    • – ప్రిలిమ్స్‌ పరీక్షను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు వరుస క్రమంలో 12 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. 
    • – ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలకు సంబంధించి స్పష్టమైన తేదీలను కమిషన్‌ త్వరలో ప్రకటిస్తుంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
    • – గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద 2 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లో తెలిపింది. మొత్తంగా 29 రకాల క్రీడలకు సంబంధించి కోటా అమలు చేయనుంది. 

    గరిష్ట వయోపరిమితిపై పునరాలోచించాలి 
    ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి జనరల్‌ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని జనరల్‌ కేటగిరీ నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. పదకొండేళ్లుగా రాష్ట్రంలో గ్రూప్‌–1 ఉద్యోగ ప్రకటన వెలువడలేదని, జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ తదితర ఉద్యోగ నియామకాలు జరగలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ.. వయోభారంతో అర్హత కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని ప్రస్తుతం 44 ఏళ్లకు ప్రభుత్వం పెంచినప్పటికీ చాలామందికి అవకాశం రావడం లేదంటున్నారు. 

    తొలిసారిగా ఉర్దూలో.. 

    ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కూడా 
    ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్‌ పరీక్షలు రాసే అవకాశం కలి్పస్తారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షల్లో అవకాశం కలి్పస్తారు. ప్రతి మల్టీ జోన్‌ వారీగా, రిజర్వేషన్లు, కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, స్పోర్ట్స్‌ కోటాల వారీగా ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలను తెలుగు, ఇంగ్లీ‹Ùతో పాటు ఉర్దూ భాషలో నిర్వహించనున్నారు. గ్రూప్‌–1 పరీక్ష ఉర్దూ బాషలో నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కూడా తొలిసారిగా అమలు కానున్నాయి. 
     
    శాఖల వారీగా పోస్టుల వివరాలు 

    పోస్టుఖాళీలువయో పరిమితి
    డిప్యూటీ కలెక్టర్‌4218–44
    డీఎస్పీ9121–31
    కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌4818–44
    రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌421–31
    జిల్లా పంచాయతీ అధికారి518–44
    జిల్లా రిజి్రస్టార్‌518–44
    డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌)221–31
    అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌818–44
    అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌2621–31
    మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2)4118–44
    అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సాంఘిక సంక్షేమం)318–44
    డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం)518–44
    డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం)218–44
    జిల్లా ఉపాధి కల్పనాధికారి218–44
    పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ)2018–44
    అసిస్టెంట్‌ ట్రెజరర్‌(ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌)3818–44
    అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌(స్టేట్‌ ఆడిట్‌ సరీ్వస్‌)4018–44
    ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి)12118–44

    తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

     రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. పలు విభాగాల్లో పదహారు వేలకు పైగా ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

    16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
    కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు

    • కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
    • కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
    • కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
    • కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
    • కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
    • ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
    • వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
    • వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
    • కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
    • కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
    • కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
    • మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

    ఎస్సై పోస్టుల వివరాలు

    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
    • స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
    • డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
    • మొత్తం ఎస్సై పోస్టులు: 587

    అర్హతలు

    • పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచే సిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన వారు కూడా అర్హులే. 
    • ఐటీ, కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. 
    • 2022 జూలై 1 నాటికి ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

    వయోపరిమితి

    • కానిస్టేబుల్‌ పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు కాగా, ప్రభుత్వం మూడేళ్ల వయోపరిమితి సడలింపు అవకాశం ఇవ్వడంతో 25 ఏళ్ల వరకు వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు వయోపరిమితి సడలింపుతో 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఎంపిక విధానం

    • ప్రిలిమినరీ రాత పరీక్ష 
    • ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ 
    • ఫైనల్‌ రాత పరీక్ష

    ప్రిలిమినరీ రాత పరీక్ష

    ఎస్సై, కానిస్టేబుల్‌ విభాగాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రిలిమినరీ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. అయితే ఈ సారి నుంచి ప్రిలిమినరీ రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/5వ వంతు మార్కు కోత వి«ధిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ రాత పరీక్షలో 30 శాతం మార్కులు(60 మార్కులు) సాధించిన అభ్యర్థులను తర్వాత దశ(ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌)కు ఎంపిక చేస్తారు.


    ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ దశలో నిర్ణీత సమయంలో పురుష అభ్యర్థులు 1600 మీ. పరుగు, మహిళ అభ్యర్థులు 800 మీటర్ల పరుగులో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి లాంగ్‌ జంప్, షార్ట్‌పుట్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. 

    ఫైనల్‌ రాత పరీక్ష

    • కానిస్టేబుల్స్‌ ఫైనల్‌ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఇందులో అర్థమెటిక్,రీజనింగ్, జనరల్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపరులో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఏఆర్, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్స్‌కు ఫైనల్‌ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 
    • సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఫైనల్‌ రాత పరీక్షలో 4 పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లలో ఇంగ్లిష్, తెలుగు భాషాంశాలపై 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. 3, 4వ పేపర్లుగా అర్థమెటిక్‌–రీజనింగ్, జనరల్‌ స్టడీస్‌ అంశాలపై 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఈ సారి నెగిటివ్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. 




    సిలబస్‌

    • పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్‌) ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్,అర్థమెటిక్,జనరల్‌సై¯Œ్స, భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి,భారత జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం,పాలిటీ,ఎకానమీ,జాతీయ,అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఫైనల్‌ రాత పరీక్షలో ప్రిలిమినరీ పరీక్షలోని సిలబస్‌ అంశాలకు అదనంగా పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు,సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. 
    • ఎస్సై (సివిల్‌/తత్సమానం) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్‌ అంశాలతోపాటు జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సై¯Œ ్స, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 
    • ఎస్సై(సివిల్‌/ తత్సమానం) ఫైనల్‌ రాతపరీక్ష పేపర్‌–1లో ఇంగ్లిష్‌కు సంబంధించి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, ఇతర భాషా నైపుణ్యాలపై పదోతరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్‌ విధానంలో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–3లో అర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–4 జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సై¯Œ ్స, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, భారత దేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి. 



    ప్రిపరేషన్‌

    • అర్థమెటిక్‌ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు.,సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం,భాగస్వామ్యం, వయసులు, శాతా లు, లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు,కాలం–పని, పంపులు–ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాలనుంచి ప్రశ్నలను సాధన చేయాలి. 
    • ప్యూర్‌ మ్యాథ్స్‌ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం,సంభావ్యత,త్రికోణమితి, మాత్రికలు మొద లైన అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్‌ మ్యాథ్స్‌ను కూడా చదవాలి. 
    • వెర్బల్‌ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్‌ సీక్వెన్స్, నంబర్‌ టెస్ట్, ర్యాంకింగ్‌ టెస్ట్, డైరెక్షన్‌ టెస్ట్, నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నంబర్స్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్‌ టెస్ట్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, పజిల్స్‌ టెస్ట్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్‌ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి. 
    • లాజికల్‌ రీజనింగ్‌లో లాజికల్‌ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ అసంప్షన్స్, అసర్షన్‌ అండ్‌ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
    • నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్‌ అండ్‌ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్‌ ఇమేజెస్, వాటర్‌ ఇమేజెస్, కంప్లీషన్‌ ఆఫ్‌ ఫిగర్స్, పేపర్‌ ఫోల్డింగ్, పేపర్‌ కట్టింగ్, కౌంటింగ్‌ ఫిగర్స్‌ మొదలైనవి ముఖ్యమైనవి. 



    నోటిఫికేషన్‌ వివరాలు

    • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
    • దరఖాస్తులు ప్రారంభం: 2022 మే 2
    • దరఖాస్తులకు చివరితేది: 2022 మే 20
    • వెబ్‌సైట్‌: http://www.tslprb.in

    గణిత అంశాలపై భయం వీడాలి

    పోలీసు నియామక పరీక్షల్లో గణిత అంశాలైన అర్థమెటిక్, రీజనింగ్‌ సబ్జెక్టులు ప్రధానమైనవి. మ్యాథ్స్‌ నేపథ్యం ఉన్నవారు ఈ విభాగాల్లో సులభంగా మార్కులు సాధించగలుగుతారు. అయితే కొద్దిపాటి సాధన చేస్తే నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులు కూడా అర్థమెటిక్, రీజనింగ్‌పై సులభంగా పట్టు పెంచుకోవచ్చు. ముందుగా గణిత అంశాలపై భయాందోళనలను వీడి ప్రాథమిక భావనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్‌ స్టడీస్‌ అంశాల్లో కరెంట్‌ అఫైర్స్‌ విభాగం ఎంతో ముఖ్యమైంది. కాబట్టి దీనిపై ఎక్కువ దృష్టి సారించాలి. గత ఏడాదిగా చోటుచేసుకున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈసారి ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్టు ముఖ్యపాత్ర వహించే అవకాశం ఉంది. 800 మీటర్ల పరుగును పురుషులకు 1600 మీటర్లకు పెంచారు. కాబట్టి అభ్యర్థులు ముందునుంచే ఎక్కువగా సాధన చేయాలి. దీనిలో రాణించగలిగితే ఫైనల్‌ రాత పరీక్షకు ముందే 70 శాతం విజయావకాశాలను సొంతం చేసుకున్నవారవుతారు. మాక్‌టెస్టులను రాస్తూ పరీక్ష హాలులో ఎదురయ్యే ఒత్తిడిని జయించేలా సన్నద్ధమవ్వాలి. పరీక్ష రాస్తున్నప్పుడు ఏవైనా క్లిష్టమైన ప్రశ్నలు వస్తే ఆందోళన చెందకుండా మిగతా ప్రశ్నలపై దృష్టిసారించాలి. పరీక్ష హాలులోకి వీలైనంత ముందుగా ప్రవేశించడం ద్వారా పరీక్ష వాతావరణానికి అలవాటు పడి పూర్తి ప్రశాతంగా పరీక్ష రాయొచ్చు. అప్పుడే పోలీసు కొలువు సొంతం చేసుకోవచ్చు. 
    – ఎం.తిరుపతి, ఎస్సై–2020 బ్యాచ్‌ (2020లో శిక్షణ పూర్తిచేసుకుని ప్రస్తుతం హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.)

    నెగిటివ్‌ మార్కులపై జాగ్రత్తగా ఉండాలి

    పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు ఏమాత్రం సమయం వృథా చేయకుండా పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ కొనసాగించాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ను ముందుగా విశ్లేషించుకోవాలి. అంశాలవారీగా సన్నద్ధమవ్వాలి. రివిజన్‌ చేసుకోవడానికి వీలుగా నోట్సు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే చదివిన అంశాలను క్రమం తప్పకుండా రివిజన్‌ చేసుకోవడానికి వీలవుతుంది. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్నల స్థాయిపై అవగాహన ఏర్పరచుకోవాలి. అనువర్తన ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్‌ సాధన చేయాలి. ఈ ఏడాది నుంచి నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు సమాధానాలు గుర్తించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ‘జతపరచండి’తరహా ప్రశ్నల విషయంలో గందరగోళానికి గురికాకుండా కచ్చితమైన సమాధానాలు గుర్తించాలి. మాక్‌టెస్టులు/గ్రాండ్‌టెస్ట్‌లు రాసి స్వీయవిశ్లేషణ చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవాలి.