Thursday 31 May 2018

తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాలు (చివరి తేది: 30.06.18)

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) పోలీసు శాఖలోని పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు అగ్నిమాపక విపత్తు నివారణ, జైళ్లశాఖ, ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్, డిప్యూటీ జైలర్, వార్డర్, అసిస్టెంట్ మ్యాట్రన్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో 17,156 ఉద్యోగాలు కానిస్టేబుళ్లు కాగా.. 1272 ఎస్సై పోస్టులు ఉన్నాయి.వివరాలు.....మొత్తం పోస్టుల సంఖ్య: 18,4281) కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 17,156విభాగాల‌వారీ ఖాళీలు: సివిల్‌-5909, ఏఆర్‌-5273, ఎస్ఏఆర్ సీపీఎల్-53, టీఎస్ ఎస్‌పీ-4816, ఎస్‌పీఎఫ్‌-485, ఫైర్ స‌ర్వీస్-168, వార్డర్స్ (మేల్‌)-186, వార్డర్స్ (ఫిమేల్‌)-35, ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌-142, మెకానిక్స్ (ట్రాన్స్‌పోర్ట్)-19, డ్రైవ‌ర్స్‌-70. అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌కు నిబంధ‌ల మేర‌కు అర్హత‌లు అవ‌స‌రం. ఎస్టీ అభ్యర్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత సాధించి ఇంట‌ర్ రెండేళ్ల ప‌రీక్షల‌కు హాజ‌రైతే స‌రిపోతుంది. వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 18-22 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1996 కంటే ముందు జులై 1, 2000 త‌ర్వాత జ‌న్మించిన‌వారు
అన‌ర్హులు. డ్రైవ‌ర్ పోస్టుల‌కు 21-25 ఏళ్లలోపు వారు అర్హులు.
2) ఎస్సై పోస్టుల సంఖ్య: 1272విభాగాలవారీ ఖాళీల వివ‌రాలు: సివిల్-710, ఏఆర్‌-275, ఎస్ఏఆర్ సీపీఎల్‌-05, రిజ‌ర్వ్-175, రిజ‌ర్వ్ (15 బెటాలియ‌న్‌)-16, ఫైర్ స‌ర్వీస్ 19, డిప్యూటీ జైల‌ర్‌-15, అసిస్టెంట్ మ్యాట్రన్‌-02, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్‌-29, ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో-26.అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్టీ అభ్యర్థులైతే ఇంట‌ర్ ఉత్తీర్ణత‌తోపాటు క‌నీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు చ‌దివితే స‌రిపోతుంది. ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్ పోస్టుల‌కు ఈసీఈ/ ఈఈఈ/ సీఎస్‌/ ఐటీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో పోస్టుల‌కు కంప్యూట‌ర్ సైన్స్ / ఐటీ/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ వీటిలో ఎందులోనైనా డిగ్రీ ఉండాలి.వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఫైర్ స‌ర్వీస్‌, డిప్యూటీ జైల‌ర్ పోస్టుల‌కు 30 ఏళ్లలోపువారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపిక: ప్రాథ‌మిక రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్ అండ్ ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, తుది రాత‌ప‌రీక్ష ద్వారా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ద‌ర‌ఖాస్తు ఫీజు: కానిస్టేబుల్ పోస్టులకు రూ.800, ఎస్సై పోస్టులకు రూ.1000.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 09.06.2018ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2018
 
 

Sunday 27 May 2018

టీఎస్ఎన్‌పీడీసీఎల్‌లో 68 అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు (చివ‌రి తేది: 27.06.18)

వ‌రంగ‌ల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన‌సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్‌పీడీసీఎల్‌) అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)మొత్తం పోస్టుల సంఖ్య: 68 (ఎలక్ట్రికల్-66, సివిల్-02)అర్హత‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఏఎంఐఈ పరీక్ష ఉత్తీర్ణత‌.వ‌య‌సు: 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.ప‌రీక్ష తేది: 15.07.2018 ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌రకు.ప‌రీక్ష విధానం: మొత్తం 100 మార్కుల‌కు 100 మ‌ల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. కాల వ్యవ‌ధి 2 గంట‌లు. కోర్ టెక్నిక‌ల్ స‌బ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు వ‌స్తాయి.ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ, వ‌రంగ‌ల్ జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలోని కేంద్రాల్లో.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి (రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు).ఫీజు చెల్లింపు ప్రారంభం: 12.06.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 13.06.2018ఫీజు చెల్లింపు, ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.06.2018
 
 
 

టీఎస్ఎన్‌పీడీసీఎల్‌లో 497 స‌బ్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 18.06.18)

వ‌రంగ‌ల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన‌సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్‌పీడీసీఎల్‌) స‌బ్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* స‌బ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌)మొత్తం పోస్టుల సంఖ్య: 497అర్హత‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌.వ‌య‌సు: 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.ప‌రీక్ష తేది: 08.07.2018 ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌రకు.ప‌రీక్ష విధానం: మొత్తం 100 మార్కుల‌కు 100 మ‌ల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. కాల వ్యవ‌ధి 2 గంట‌లు. కోర్ టెక్నిక‌ల్ స‌బ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు వ‌స్తాయి.ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ, వ‌రంగ‌ల్ జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలోని కేంద్రాల్లో.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి (రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు).ఫీజు చెల్లింపు ప్రారంభం: 04.06.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 05.06.2018ఫీజు చెల్లింపు, ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.06.2018
 
 
 

Ramadan Kareem 2018 Wishes || Ramadan Mubarak 2018 Greetings

Sunday 20 May 2018

Home Based Data Entry Work || Copy Paste Work || Free Job Work

ఇండియ‌న్ రైల్వేస్‌లో 1120 స‌బ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు (చివ‌రి తేది: 30.06.18)

ఇండియ‌న్ రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్‌)ల‌లో స‌బ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌లైంది. వివరాలు.....* స‌బ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్‌)మొత్తం ఖాళీలు: 1120 (పురుషుల‌కు 819, మ‌హిళ‌ల‌కు 301)అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత‌. నిర్దేశించిన శారీర‌క ప్రమాణాలు ఉండాలి.వ‌య‌సు: 01.07.2018 నాటికి 20-25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ (పీఈటీ) అండ్ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడిక‌ల్ టెస్ట్ ద్వారా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (ప‌రీక్షకు హాజ‌రైన అభ్యర్థుల‌కు బ్యాంకు ఛార్జీలు మిన‌హాయించుకుని రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 01.06.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.06.2018

ఇండియ‌న్ రైల్వేస్‌లో 8619 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రి తేది: 30.06.18)

ఇండియ‌న్ రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్ స్పెష‌ల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్‌)ల‌లో కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌లైంది. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌హిళా అభ్యర్థులు (నోటిఫికేష‌న్ నెం.01/2016) మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోన‌వ‌స‌రం లేదు.వివరాలు.....* కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌)మొత్తం ఖాళీలు: 8619 (పురుషుల‌కు 4403, మ‌హిళ‌ల‌కు 4216)అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌. నిర్దేశించిన శారీర‌క ప్రమాణాలు ఉండాలి.వ‌య‌సు: 01.07.2018 నాటికి 18-25 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ (పీఈటీ) అండ్ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడిక‌ల్ టెస్ట్ ద్వారా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 (ప‌రీక్షకు హాజ‌రైన అభ్యర్థుల‌కు బ్యాంకు ఛార్జీలు మిన‌హాయించుకుని రూ.400 తిరిగి చెల్లిస్తారు).ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 01.06.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.06.2018

Sunday 13 May 2018

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018

ఇన్‌కంట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీబీఐ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (గెజిటెడ్), ఆడిట్ ఆఫీసర్ (గెజిటెడ్) వంటి ఉన్నత హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ కొలువులు కోరుకునేవారికి శుభవార్త.
Adminissionsలక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కంబైన్‌‌డ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) మే 5న విడుదల చేసింది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే.. గ్రూప్-బి,ిసి ఉద్యోగాలు పొందే సదవకాశం సీజీఎల్ పరీక్ష ద్వారా లభిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికై తే ఉద్యోగ భద్రత కలిగిన కేంద్ర ప్రభుత్వ కొలువుతోపాటు నెలకు రూ.50 వేలకుపైగా వేతనం అందుతుంది.

జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోస్టులతో పాటు పలు కేంద్ర సర్వీసులకు కూడా భర్తీ చేస్తుంది. వాటి తర్వాత ప్రాధాన్యమున్న గ్రూప్-బి(గెజిటెడ్), నాన్ గెజిటెడ్, గ్రూప్-సి (నాన్ టెక్నికల్) పోస్టుల నియామాక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపడుతుంది. ఏటా సీజీఎల్ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.

పోస్టులివే..
నోటిఫికేషన్‌లో ఖాళీల సంఖ్యను వెల్లడించలేదు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఐబీ, రైల్వే, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాల కేంద్ర కార్యాలయాలు, ఇతర మంత్రిత్వ శాఖలు), వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్లు, అసిస్టెంట్/సూపరింటెండెంట్ (వివిధ మంత్రిత్వ శాఖల్లో), ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎకై ్సజ్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ, ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌వో), ఆడిటర్స్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ ఆసిస్టెంట్లు వంటి పలు రకాల పోస్టులను సీజీఎల్ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

డిగ్రీ చదివితే చాలు..
2018, ఆగస్టు 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సీజీఎల్ పరీక్షకు అర్హులు. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జేఎస్‌వో పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి (లేదా) డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
  • ఏఏవో పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్/మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/ఎంకామ్/మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్/ఎంబీఏ(ఫైనాన్‌‌స)/మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ విద్యార్హతలు అభిలషణీయం.

పోస్టులను బట్టి వయసు :
పోస్టును బట్టి గరిష్టంగా 27 నుంచి 32 ఏళ్ల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత సాధించాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. దేహదారుఢ్య పరీక్షలూ ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థుల తుది ఎంపిక పోస్టుల ఆధారంగా మూడు/నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కమిషన్ నిర్ణయించిన నిర్దేశిత మార్కులు సాధించిన వారినే తర్వాతి దశ టైర్-2కు పిలుస్తారు. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే. ఇందులోనూ నెగ్గితే తర్వాతి దశలో టైర్-3(డిస్క్రిప్టివ్ పరీక్ష)కు అర్హత లభిస్తుంది. టైర్-1, 2ల్లో రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. సెక్షన్ కటాఫ్ ఉండదు. టైర్-3 ఇంగ్లిష్/హిందీ భాషలో ప్రావీణ్యం పరీక్షించే విధంగా ఉంటుంది. తర్వాత దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఫైనల్‌గా టైర్-1, 2, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

పరీక్షా విధానం :
  • టైర్-1ను గంట వ్యవధిలో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు సబ్జెక్టులు.. జనరల్ ఇంటెలిజెన్‌‌స అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • టైర్ -2: టైర్-1లో కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు టైర్-2కు అర్హత లభిస్తుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అయితే పేపర్-1, పేపర్-2లు అన్ని పోస్టులకు కామన్‌గా ఉంటాయి. ఇక జేఎస్‌వో పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే.. పేపర్-3 (200 మార్కులకు); అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే పేపర్-4 (200 మార్కులకు)కు హాజరు కావాలి. పేపర్-3 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌పై; పేపర్-4 ఫైనాన్‌‌స అండ్ ఎకనామిక్స్ సబ్జెక్టులపై ఉంటుంది. ఇవి కూడా మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి. కామన్‌గా ఉంటే పేపర్-1,2ల్లో వరుసగా క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ సబ్జెక్టులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్‌లో 100 ప్రశ్నలు.. 200 మార్కులకు; ఇంగ్లిష్‌లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
  • టైర్ -1,2లో మెరిట్ జాబితాలో నిలిచిన వారికి టైర్-3 నిర్వహిస్తారు. గంట సమయంలో నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో రాయాలి. హిందీ/ ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి. గమనిక: టైర్ -1, 2, 3లలో వేర్వేరుగా ప్రత్యేకంగా ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

ముఖ్య తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
2018, జూన్ 4 (సాయంత్రం 5 గంటల వరకు)
టైర్-1 పరీక్ష తేదీలు: 2018 జూలై 25 నుంచి ఆగస్టు 20 వరకు.
టైర్ - 2,  టైర్- 3, టైర్- 4 తేదీలను తర్వాత నోటిఫై చేస్తారు.
ఫీజు: రూ.100 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ssc.nic.in


Monday 7 May 2018

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు (చివరి తేది: 15.05.18)

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరంలో ఖాళీ సీట్లకు, కరీంనగర్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.వివరాలు.....1) 6 నుంచి 9 తరగతుల బ్యాక్‌లాగ్ ఖాళీలు2) సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, క‌రీంన‌గ‌ర్‌లో 8 త‌ర‌గ‌తి ప్రవేశాలుఅర్హత: 2017-18 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.పరీక్ష తేది: 03.06.2018దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 01.05.2018ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 15.05.2018

 
 

తెలంగాణ గురుకులం-ఖ‌మ్మం ప్రతిభా పాఠ‌శాల (చివ‌రి తేది: 16.05.18)

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఖ‌మ్మం ప్రతిభా పాఠ‌శాల‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశానికి ప్రక‌ట‌న విడుద‌లైంది.వివ‌రాలు.......* ఖ‌మ్మం ప్రతిభా పాఠ‌శాల‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్రవేశాలుసీట్ల సంఖ్య: 90అర్హతః ఏప్రిల్ 2018లో 7 త‌ర‌గ‌తి ప‌రీక్షల‌కు హాజ‌రైన‌ తెలంగాణ‌కు చెందిన గిరిజ‌న బాల‌బాలిక‌లు అర్హులు.ఎంపిక‌: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.ప‌రీక్ష తేది: 03.06.2018ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.30చివ‌రి తేది: 16.05.2018