Sunday 13 May 2018

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018

ఇన్‌కంట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీబీఐ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (గెజిటెడ్), ఆడిట్ ఆఫీసర్ (గెజిటెడ్) వంటి ఉన్నత హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ కొలువులు కోరుకునేవారికి శుభవార్త.
Adminissionsలక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కంబైన్‌‌డ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) మే 5న విడుదల చేసింది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే.. గ్రూప్-బి,ిసి ఉద్యోగాలు పొందే సదవకాశం సీజీఎల్ పరీక్ష ద్వారా లభిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికై తే ఉద్యోగ భద్రత కలిగిన కేంద్ర ప్రభుత్వ కొలువుతోపాటు నెలకు రూ.50 వేలకుపైగా వేతనం అందుతుంది.

జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోస్టులతో పాటు పలు కేంద్ర సర్వీసులకు కూడా భర్తీ చేస్తుంది. వాటి తర్వాత ప్రాధాన్యమున్న గ్రూప్-బి(గెజిటెడ్), నాన్ గెజిటెడ్, గ్రూప్-సి (నాన్ టెక్నికల్) పోస్టుల నియామాక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపడుతుంది. ఏటా సీజీఎల్ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.

పోస్టులివే..
నోటిఫికేషన్‌లో ఖాళీల సంఖ్యను వెల్లడించలేదు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఐబీ, రైల్వే, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాల కేంద్ర కార్యాలయాలు, ఇతర మంత్రిత్వ శాఖలు), వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్లు, అసిస్టెంట్/సూపరింటెండెంట్ (వివిధ మంత్రిత్వ శాఖల్లో), ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎకై ్సజ్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ, ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌వో), ఆడిటర్స్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ ఆసిస్టెంట్లు వంటి పలు రకాల పోస్టులను సీజీఎల్ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

డిగ్రీ చదివితే చాలు..
2018, ఆగస్టు 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సీజీఎల్ పరీక్షకు అర్హులు. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జేఎస్‌వో పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి (లేదా) డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
  • ఏఏవో పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్/మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/ఎంకామ్/మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్/ఎంబీఏ(ఫైనాన్‌‌స)/మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ విద్యార్హతలు అభిలషణీయం.

పోస్టులను బట్టి వయసు :
పోస్టును బట్టి గరిష్టంగా 27 నుంచి 32 ఏళ్ల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత సాధించాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. దేహదారుఢ్య పరీక్షలూ ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థుల తుది ఎంపిక పోస్టుల ఆధారంగా మూడు/నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కమిషన్ నిర్ణయించిన నిర్దేశిత మార్కులు సాధించిన వారినే తర్వాతి దశ టైర్-2కు పిలుస్తారు. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే. ఇందులోనూ నెగ్గితే తర్వాతి దశలో టైర్-3(డిస్క్రిప్టివ్ పరీక్ష)కు అర్హత లభిస్తుంది. టైర్-1, 2ల్లో రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. సెక్షన్ కటాఫ్ ఉండదు. టైర్-3 ఇంగ్లిష్/హిందీ భాషలో ప్రావీణ్యం పరీక్షించే విధంగా ఉంటుంది. తర్వాత దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఫైనల్‌గా టైర్-1, 2, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

పరీక్షా విధానం :
  • టైర్-1ను గంట వ్యవధిలో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు సబ్జెక్టులు.. జనరల్ ఇంటెలిజెన్‌‌స అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • టైర్ -2: టైర్-1లో కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు టైర్-2కు అర్హత లభిస్తుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అయితే పేపర్-1, పేపర్-2లు అన్ని పోస్టులకు కామన్‌గా ఉంటాయి. ఇక జేఎస్‌వో పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే.. పేపర్-3 (200 మార్కులకు); అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే పేపర్-4 (200 మార్కులకు)కు హాజరు కావాలి. పేపర్-3 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌పై; పేపర్-4 ఫైనాన్‌‌స అండ్ ఎకనామిక్స్ సబ్జెక్టులపై ఉంటుంది. ఇవి కూడా మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి. కామన్‌గా ఉంటే పేపర్-1,2ల్లో వరుసగా క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ సబ్జెక్టులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్‌లో 100 ప్రశ్నలు.. 200 మార్కులకు; ఇంగ్లిష్‌లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
  • టైర్ -1,2లో మెరిట్ జాబితాలో నిలిచిన వారికి టైర్-3 నిర్వహిస్తారు. గంట సమయంలో నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో రాయాలి. హిందీ/ ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి. గమనిక: టైర్ -1, 2, 3లలో వేర్వేరుగా ప్రత్యేకంగా ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

ముఖ్య తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
2018, జూన్ 4 (సాయంత్రం 5 గంటల వరకు)
టైర్-1 పరీక్ష తేదీలు: 2018 జూలై 25 నుంచి ఆగస్టు 20 వరకు.
టైర్ - 2,  టైర్- 3, టైర్- 4 తేదీలను తర్వాత నోటిఫై చేస్తారు.
ఫీజు: రూ.100 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ssc.nic.in


No comments:

Post a Comment