Sunday 27 May 2018

టీఎస్ఎన్‌పీడీసీఎల్‌లో 497 స‌బ్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 18.06.18)

వ‌రంగ‌ల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన‌సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్‌పీడీసీఎల్‌) స‌బ్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు.....* స‌బ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌)మొత్తం పోస్టుల సంఖ్య: 497అర్హత‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిప్లొమాతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత‌.వ‌య‌సు: 18-44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.ప‌రీక్ష తేది: 08.07.2018 ఉద‌యం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌రకు.ప‌రీక్ష విధానం: మొత్తం 100 మార్కుల‌కు 100 మ‌ల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. కాల వ్యవ‌ధి 2 గంట‌లు. కోర్ టెక్నిక‌ల్ స‌బ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ అండ్ న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు వ‌స్తాయి.ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ, వ‌రంగ‌ల్ జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలోని కేంద్రాల్లో.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి (రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు).ఫీజు చెల్లింపు ప్రారంభం: 04.06.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 05.06.2018ఫీజు చెల్లింపు, ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.06.2018
 
 
 

No comments:

Post a Comment