Sunday 13 March 2016

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : జీవితంపై విరక్తితో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహ్మత్‌నగర్ బంగారు మైసమ్మ గుడి సమీపంలో నివసించే సిహెచ్.రాఘవేంద్ర సాగర్(20) గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

గత కొద్ది రోజుల నుంచి ఆత్మన్యూనతా భావానికి గురవుతూ తనలో తానే మదనపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆదివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment