Saturday 19 March 2016

పేద విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్


హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వృత్తి విద్యాధికారి పి.సుకీర్తి తెలిపారు. జిల్లా వృత్తి విద్యాధికారి ఆధ్వర్యంలోనే ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహణ ఉంటుందని చెప్పారు. అబ్బాయిలకు బాగ్‌లింగంపల్లిలోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో, బాలికలకు నృపతుంగ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ను గానీ, గన్‌ఫౌండ్రీ వద్ద గల జిల్లా వృత్తి విద్యాధికారి కార్యాలయంలో గానీ సంప్రదించాలని ఆమె సూచించారు

No comments:

Post a Comment