Monday 27 May 2019

పోలీసు మెయిన్ పరీక్షల తుది 'కీ' విడుదల

తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాల్లో ఫలితాల్లో మొత్తం 83.46 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్‌ఐ పరీక్షలకు సంబంధించి మొత్తం 53,633 మంది అభ్యర్థులు తుది పరీక్షలు రాయగా.. వీరిలో 39,079 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి 1,09,095 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 96,750 అభ్యర్థులు అర్హత సాధించారు. కాగా.. మెయిన్ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌'కీ'ని పోలీస్ నియామక మండలి సోమవారం (మే 27) విడుదల చేసింది. విభాగాల వారీగా ఆన్సర్'కీ'ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

✦ ఎస్‌ఐ (సివిల్) ఫైనల్ 'కీ' 

✦ ఎస్‌ఐ (ఐటీ/కమ్యూనికేషన్స్)/ ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) ఫైనల్ 'కీ' 
✦ కానిస్టేబుల్ (సివిల్) ఫైనల్ 'కీ' 

✦ కానిస్టేబుల్ (ఐటీ/కమ్యూనికేషన్స్) ఫైనల్ 'కీ' 

✦ కానిస్టేబుల్ (డ్రైవర్) ఫైనల్ 'కీ' 

✦ కానిస్టేబుల్ (మెకానిక్) ఫైనల్ 'కీ' 

✪ ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

రాష్ట్రంలో మొత్తం 18,428 పోలీసు పోస్టుల భర్తీకి గతేడాది మేలో పోలీసు నియామక మండలి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటి 17,156 కానిస్టేబుల్ ఉండగా.. 1,272 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌, మే నెలల్లో తుది పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

తుది ఫలితాల్లో అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం.. ఖాళీలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తారు. కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో తుది జాబితాలో ఎంపికై అభ్యర్థులకు జూన్‌ నుంచే పోలీసు శిక్షణ ప్రారంభం కానుంది. జూన్‌ నెలాఖరునాటికి ఎస్‌ఐలకు, జులై నుంచి కానిస్టేబుల్ శిక్షణ చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 
వెబ్‌సైట్ 

No comments:

Post a Comment