Monday 27 May 2019

టీఎస్ పీఈసెట్ 2019 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఫిజకల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) - 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం (మే 27) ఫలితాలను విడుదల చేశారు. అధికార వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీఈసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ)లో 2,038 మంది అభ్యర్థులు, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ)లో 1,798 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. 

వెబ్‌సైట్..
 

పీఈసెట్ పరీక్ష ద్వారా వ్యాయామ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి రెండేళ్ల బ్యాచిలర్ కోర్సు, రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం మహాత్మాగాంధీ యూనివర్సిటీ మే 15న పీఈసెట్-2019 పరీక్ష నిర్వహించింది. 

No comments:

Post a Comment