
SBI-PO Preliminary Exam Hall Tickets
ఎస్బీఐలో మొత్తం 2000 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి జూన్ 8, 9, 15, 16 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జులై మొదటివారంలో ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారిని మెయిన్ పరీక్షలకు ఎంపికచేస్తారు.
జులై 20న మెయిన్ పరీక్ష
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జులై 20న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన హాల్టికెట్లను జులై రెండో వారంలో విడుదల చేయనున్నారు. ఆగస్టు మూడోవారంలో మెయిన్ ఫలితాలు వెల్లడిస్తారు. మెయిన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారికి సెప్టెంబరులో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన కాల్ లెటర్లను ఆగస్టు నాలుగో వారంలో విడుదల చేస్తారు. తుది ఫలితాలను అక్టోబరు రెండో వారంలో వెల్లడిస్తారు.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment