Wednesday 20 June 2018

జులై 1 నుంచి స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తులు..

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు 2018-19 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం జులై 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. టీఎస్‌ఈపాస్‌ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నెలాఖరు నాటికి 80 శాతం ప్రవేశాలు పూర్తికానున్న నేపథ్యంలో ఉపకారవేతనాల దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

No comments:

Post a Comment