Saturday 3 October 2015

కరెంటు షాక్..ఊపిరాగింది


కరెంటు షాక్..ఊపిరాగింది

ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురై అక్కడిక్కడే మరణించాడు. అలహాబాద్‌లోని జంగాయి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ ఏటీఎం బూత్‌కు బ్రిజేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం వెళ్లాడు. డబ్బులు డ్రా చేసే క్రమంలో తన ఏటీఎంకార్డును మెచీన్ స్లాట్‌లో పెట్టిన వెంటనే విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు

ఈ ఘటన పై తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు బ్యాంక్ ఉద్యోగులను నిర్భంధించి బ్రిజేష్ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఘటన పై విచారణ చేపట్టిన పోలీసులు బ్రిజేష్ పూర్తిగా వర్షంలో తడిచి ఏటీఎంలోకి వెళ్లినందున షాక్ తీవ్రత రెట్టింపై ఉంటుదని, ఈ కారణంగానే అతుడు మృతిచెంది ఉదడొచ్చని భావిస్తున్నారు.
దీంతో పాటు ఏటీఎం ఉన్న భవనం పురాతనమైనదని, మెషిన్ లో వైరింగ్ లోపాలు కూడా ఉన్నయేమోనని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ఏటీఎంను వినియోగించుకునేందుకు స్థానికులు జంకుతున్నారు


No comments:

Post a Comment