జార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహర్ జిల్లా,
బరియటు గ్రామానికి చెందిన రాంతూ ఓరన్ అనే వ్యక్తి నిద్ర పోయేందుకు ఇంటి
ఆరుబయట పడుకున్నాడు. అలా కన్నుమూసీ మూయగానే ఓ పాము వచ్చి కాటేసింది.
అంతే... అతనికున్న మూఢ నమ్మకం ప్రకారం పామును చంపేస్తే విషం
విరుగుడవుతుందని భావించి దాన్ని వెతకడం ప్రారంభించాడు.
అతడికి చుట్టుపక్కల వారు తోడయ్యారు. వారంతా
కలిసి పామును గుర్తించి.. ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత రాంతూ ఓరన్
నోటితో కొరికి, నమిలుతూ పామును చంపేశాడు. ఆ తర్వాత యధావిధిగా నిద్రపోయాడు.
అయితే, పాము కాటుకు గురైన ఓరన్ శరీరం విషం కారణంగా రంగుమారడాన్ని
గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం
కాపాడలేక పోయారు.
No comments:
Post a Comment