-తీవ్ర వాయుగుండంగా మారేందుకు ఆస్కారం
-తాంబన్-నాగపట్టణం మధ్య తీరం దాటే అవకాశం
-తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు
-48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు
-విశాఖ వాతావరణశాఖ కేంద్రం ప్రకటన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నది. నైరుతి బంగాళాఖాతం- శ్రీలంక తీరం మధ్య అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నదని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ కేంద్రం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. ఈ నెల 17న (మంగళవారం) ఉదయంనాటికి తమిళనాడులోని తాంబన్-నాగపట్టణం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావం చుట్టూ 200కిలోమీటర్ల వరకు ఉంటుందని హెచ్చరించింది. కాగా, అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి చెన్నై, తిరువనంతపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment