Thursday 8 June 2017

తెలంగాణ గురుకులాల్లో 304 ప్రిన్సిపల్ పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో 304 ప్రిన్సిపల్ పోస్టులు


తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 304 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobs గురుకుల పాఠశాలల వారీ ఖాళీలు: గురుకుల పాఠశాలలు-14; సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు-43, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -43, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -188; గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు -16. ఈ మొత్తం పోస్టులను బాలురు/బాలికల గురుకుల పాఠశాలల వారీగా.. బాలుర గురుకుల పాఠశాలలు -7, బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు -21, బాలుర బీసీ సంక్షేమగురుకుల పాఠశాలలు -21, బాలుర మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -92, బాలుర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (ఏజెన్సీ)-1, బాలుర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (నాన్-ఏజెన్సీ)-5; బాలికల గురుకుల పాఠశాలలు-7, బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు -22, బాలికల బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-22, బాలికల మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-96, బాలికల గిరిజన సంక్షేమగురుకుల పాఠశాలలు (ఏజెన్సీ)-2, బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు (నాన్-ఏజెన్సీ)-8 పోస్టులు ఉన్నాయి.
గమనిక: బాలికల విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వేతనం: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ పోస్టులకు రూ.42,490-96,110; మిగిలిన గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ పోస్టులకు రూ.40,270-93,780.
అర్హతలు: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. అలాగే మొత్తం 8 ఏళ్ల బోధనానుభవం ఉండాలి. ఇందులో 5 ఏళ్లు పీజీటీ/జేఎల్‌గా, మూడేళ్లు హెడ్ మాస్టర్/ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానం అభిలషణీయం.
వయోపరిమితి: 2017, జూలై 1 నాటికి 34-44 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/నిరుద్యోగ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం), ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వైవా-వోస్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో జాబితా ప్రకారం మెయిన్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్‌వెరిఫికేషన్, ఇంటర్వ్యూ/డెమానిస్ట్రేషన్/వైవా-వోస్‌కు పిలుస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ఫ్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్ విభాగాల నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)లో పేపర్-1 (సంబంధిత శిక్షణ అంశం, స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్)లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. పేపర్-2 (విద్యాహక్కు చట్టం, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్, స్కూల్ ఆర్గనైజేషన్, టీచర్ ఎంపవర్‌మెంట్, చైల్డ్ డెవలప్‌మెంట్)లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. అనంతరం ఇంటర్వ్యూ/డెమో/వైవా-వోస్ 30 మార్కులకు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూన్ 6, 2017.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24, 2017.
పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-జూలై 16,2017.
మెయిన్ ఎగ్జామినేషన్ : ఆగస్టు 12/13, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.tspsc.gov.in .

No comments:

Post a Comment