Wednesday 5 September 2018

ఆర్ఐఎన్ఎల్, విశాఖ‌ప‌ట్నంలో 664 జూనియ‌ర్ ట్రైనీలు (చివ‌రితేది: 25.09.18)


విశాఖ‌ప‌ట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) జూనియ‌ర్ ట్రైనీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* జూనియ‌ర్ ట్రైనీలుశిక్ష‌ణ కాలం: 24 నెల‌లు.మొత్తం ఖాళీల సంఖ్య‌: 664బ్రాంచీల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్-344, ఎల‌క్ట్రిక‌ల్‌-203, మెట‌ల‌ర్జీ-98, ఇన్‌స్ట్రుమెంటేష‌న్-19.అర్హ‌త‌: మెట్రిక్యులేషన్‌/ ఎస్ఎస్‌సీతోపాటు సంబంధిత ట్రేడులు/ బ‌్రాంచుల్లో ఐటీఐ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. నిర్దిష్ట శారీరక ప్ర‌మాణాలు ఉండాలి.వ‌యఃప‌రిమితి: 01.07.2018 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ కంప్యూట‌ర్ ఆధారిత టెస్ట్, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా.ఆన్‌లైన్ టెస్ట్ కేంద్రాలు: భువ‌నేశ్వ‌ర్, చెన్నై, దిల్లీ, హైద‌రాబాద్, కోల్‌క‌తా, కాకినాడ‌, ముంబ‌యి, ప‌ట్నా, రాంచీ, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ప్రాసెసింగ్‌ ఫీజు: రూ.300.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.09.2018.ప్రాసెసింగ్ ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: 26.09.2018.నోట్‌: గ‌తంలో ప్ర‌క‌ట‌న నెం.03/2017కు అనుగుణంగా 09.05.2018 నుంచి 14.05.2018 వ‌ర‌కు జ‌రిగిన ఆన్‌లైన్ టెస్ట్‌కు హాజ‌రైన అభ్య‌ర్థులు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేయ‌న‌వ‌సరం లేదు. అభ్య‌ర్థుల‌కు వారి పూర్వ‌పు రిజిస్ట్రేష‌న్ వివ‌రాల ఆధారంగా అడ్మిట్ కార్డ్ అంద‌జేయ‌నున్నారు.
 
 

No comments:

Post a Comment