Sunday 12 August 2018

TSLPRB 2018: ఎస్సై, ఏఎస్సై పరీక్షల తేదీ మారింది

telangana police recruitment test postponedతెలంగాణలో పోలీసు ఉద్యోగాల పరీక్ష తేదీ మారింది. కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలను సెప్టెంబర్ 2న జరగాల్సి ఉండగా.. వాటిని సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 2నే టీఎస్‌పీఎస్సీ ఏఎస్ఓ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎస్ఎల్‌పీఆర్బీ) ప్రకటించింది. కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ సీ) పరీక్షను 13,944 మంది రాయనుండగా.. ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై ఎగ్జామ్‌ను 7700 మంది అభ్యర్థులు రాయనున్నారు. 
ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటం వల్ల నష్టపోతామని, పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. 1500 మంది అభ్యర్థులు రెండు పరీక్షలనూ రాస్తున్నారని ఆయన తెలిపారు. కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ సీ) పరీక్షను సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట మధ్య నిర్వహించనున్నారు. ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పరీక్షను అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. 

No comments:

Post a Comment