Monday 20 August 2018

న్యూదిల్లీలోని భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్.. దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు. పోస్టుల వివ‌రాలు:
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 8,339

పోస్టులుసబ్జెక్టులు
పీజీటీ హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ, హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ, ఎక‌నామిక్స్‌, మ‌ర్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌
టీజీటీ హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ స్ట‌డీస్‌, పీ &హెచ్ఈ, ఆర్ట్‌& ఎడ్యుకేష‌న్‌,డ‌బ్ల్యూఈటీ.

అర్హత: పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లోమాస్టర్ డిగ్రీ, డిగ్రీ. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరి సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ విభాగంలో ఏడాది డిప్లొమా చేసి ఉండాలి.

గ‌రిష్ఠ వ‌య‌సు:
పోస్టులు వయోపరిమితి (31.08.2018)
ప్రిన్సిప‌ల్ 35 - 50 సంవత్సరాలు
వైస్ ప్రిన్సిప‌ల్ 35 - 45 సంవత్సరాలు
పీజీటీ 40 సంవత్సరాలు
టీజీటీ 35 సంవత్సరాలు
లైబ్రేరియన్ 35 సంవత్సరాలు
ప్రైమరీ టీచర్ 30 సంవత్సరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
పోస్టులు ఖాళీల సంఖ్య
ప్రిన్సిప‌ల్ 76
వైస్-ప్రిన్సిప‌ల్ 220
పీజీటీ 592
టీజీటీ 1,900
ప్రైమ‌రీ టీచ‌ర్లు 5,300
ప్రైమ‌రీ టీచ‌ర్లు (మ్యూజిక్) 201
లైబ్రేరియ‌న్ 50
మొత్తం ఖాళీల సంఖ్య 8,339

No comments:

Post a Comment