Thursday 29 December 2016

ఎయిరిండియా’లో 107 సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులు

ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. సదరన్ రీజియన్‌లోని హైదరాబాద్, చెన్నై, కేరళ స్టేషన్లలో సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులను మూడేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
Jobsస్టేషన్లు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు :
  1. చెన్నై-25 (ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-7, జనరల్-12)
  2. హైదరాబాద్-45 (ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-12, జనరల్-23)
  3. కేరళ-37 (ఎస్సీ-6, ఎస్టీ-3, ఓబీసీ-10, జనరల్-18)
వేతనం: నెలకు రూ.14,610. బేసిక్ ఏవీఎస్‌ఈసీ అర్హత సాధిస్తే రూ.1000; ఎక్స్-బిస్ సర్టిఫికెట్ ఉన్నవారికి రూ.1500 అదనంగా ఇస్తారు.
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :
  1. అర్హులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎండ్యూరన్స్ టెస్ట్-పీఈటీ)లో భాగంగా 16 సెకన్లలో 100 మీటర్లు/4.5 నిమిషాల్లో 1000 మీటర్లు (ఒక కిలోమీటర్) పరుగెత్తాలి. మహిళలకు 100 మీటర్ల పరుగు పందెంలో 6 సెకన్ల సడలింపు ఇస్తారు.
  2. పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారు రాతపరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ‘వైమానిక భద్రతా విధులపై అవగాహన’కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
    ఎత్తు :

    పురుషులు
    మహిళలు
    జనరల్
    170 సెం.మీ.
    157 సెం.మీ.
    ఎస్సీ, ఓబీసీ
    165 సెం.మీ.
    155 సెం.మీ.
    ఎస్టీ
    162.5 సెం.మీ.
    150 సెం.మీ.
  3. పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారు కూడా రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, హిందీ/ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయడానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు విధానం: సంస్థ వెబ్‌సైట్‌లో లభించే నిర్దేశిత దరఖాస్తును పూర్తిచేసి, విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్, జిరాక్స్ కాపీలతో వాకిన్‌కు హాజరుకావాలి.
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.

ముఖ్య తేదీలు :
  1. బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారికి పీఈటీ, రాత పరీక్ష తేదీ: 2017, జనవరి 5
  2. బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారికి (గ్రాడ్యుయేట్లు/ఫ్రెషర్స్‌కి) పీఈటీ 2017 జనవరి 6, రాత పరీక్ష: 2017, జనవరి 7
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.airindia.in

No comments:

Post a Comment