అద్భుతం: 45 ని.లు ఆగిన గుండె మళ్లీ కొట్టుకుంది, వైద్యుల ఘనత..
ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో ఆసుపత్రి కార్డియాక్ సైన్సెస్
సంచాలకులు డా.బాలకృష్ణన్ మాట్లాడారు. గుండెపోటు పరిస్థితుల్లో ఈసిపిఆర్
అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయని, సాంకేతిక
పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్య విధానం సంక్లిష్టమైనదనీ తెలిపారు.
జయ్సుఖ్భాయ్ విషయంలోనూ ఇదే విధానం అనుసరించామన్నారు. గుండె, కాలేయ
కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించామన్నారు. ఈ చికిత్స అనంతరం రోగి గుండె
కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పది రోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు
పొందారని, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను
విజయవంతంగా నిర్వహించామన్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్నారని, డిశ్చార్జ్
కానున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా జయ్సుఖ్భాయ్ మాట్లాడుతూ... నేను కొత్త జీవితాన్ని పొందానని
చెప్పాడు. జయ్సుఖ్భాయ్ మంగళవారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా వైద్యులు అతనికి పుష్పగుచ్ఛం ఇచ్చారు.
No comments:
Post a Comment