నేటి నుంచి టీసీసీ హాల్టికెట్లు
రాష్ట్రంలో ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీసీసీ) పరీక్షల హాల్టికెట్లు ఆదివారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16,757 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, అందుకు 93 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment