Wednesday 6 October 2021

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం అప్లై చేయండిలా...!!!

 కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి తాజా, పునరుద్ధరణ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్‌ 30 వరకు ఉందని ఇంటర్‌ బోర్డు ప్రకటిం చింది. 

ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 


దరఖాస్తుల కోసం 2020-21లో ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇంతకు ముందు జాతీయ స్కాలర్‌షిప్‌ కోసం ఎంపికైన విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులను సమర్పించాలని కోరారు. 

తాజా, పునరుద్ధరణ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. 

విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. తాత్కాలికంగా ఎంపికైన విద్యార్థుల 81,594 మంది జాబితా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు.

No comments:

Post a Comment