Friday 2 February 2018

రైల్వేలో 26,502 ఏఎల్‌పీ, టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రి తేది: 05.03.18)

భార‌త రైల్వే మంత్రిత్వ శాఖ ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి కేంద్రీయ ఉద్యోగ భ‌ర్తీ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది.
వివ‌రాలు
.......* అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ (సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేష‌న్) మొత్తం పోస్టుల సంఖ్య: 26,502
ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ ద్వారా భ‌ర్తీ అయ్యే పోస్టులు: 3262 (ఏఎల్‌పీలు 2719, టెక్నీషియ‌న్లు 543)
అర్హత‌:
ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ అప్రెంటీస్‌షిప్/ ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ఎంపిక విధానం: రెండంచెల కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ద్వారా. ఏఎల్‌పీ పోస్టుల‌కు చివ‌రిగా ఆప్టిట్యూడ్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ప‌రీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ మార్కులో మూడో వంతు చొప్పున త‌గ్గిస్తారు. స్టేజ్ 1 ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించిన‌వారికే స్టేజ్ 2 ప‌రీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 1 ప‌రీక్షలో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్టేజ్ 2లో పార్ట్ ఎ, బిలు ఉంటాయి. పార్ట్ ఎలో వంద ప్రశ్నలు వ‌స్తాయి. వీటిని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. పార్ట్ బిలో 75 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి ఒక గంట కేటాయించారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు రూ.250; మిగిలిన అంద‌రికీ రూ.500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 05.03.2018

 
 

No comments:

Post a Comment