Monday, 23 May 2016

‘కొబ్బరిమట్ట’ చిత్రం టీజర్‌

‘కొబ్బరిమట్ట’ చిత్రం టీజర్‌

Sampoornesh Babu's Kobbari Matta Telugu Movie Official Teaser 




Click to Watch Here...............!

https://youtu.be/a7wcg5m0OGM

37,500 మంది ఉద్యోగులు..........


కొత్త జిల్లాలకు 37,500 మంది ఉద్యోగులు

Thursday, 19 May 2016

Bookings ........... avilable online.

Movie Image

Brahmotsavam


  • Telugu
  • Family Entertainment
Director : Srikanth Addala
Cast : Mahesh Babu, Kajal Agarwal, Pranitha Subhash, Samantha Ruth Prabhu, Sathyaraj, Jayasudha
Producer : Prasad V Potluri
Music : Mickey J Meyar
Release Date : 20 May 2016
An drama Brahmostavam is directed by Srikanth Addala. Mahesh Babu,Kajal Agarwal, Pranitha Subhash, Samantha Ruth Prabhu, Sathyaraj, Jayasudha in the lead roles.http://www.ticketnew.com/Brahmotsavam-Telugu-Movie-Tickets-Online-Booking-Show-Timings/Release-Date/11752                                       

Wednesday, 18 May 2016

ఆభరణాలను ప్రదర్శనకు పెడితే............?

** ఇక గోల్డ్ టూరిజమ్ **

ఇక    గోల్డ్ టూరిజమ్



పర్యాటకులు భారత్‌కు తాజ్‌మహల్ చూడటానికి వస్తారు. రెడ్ ఫోర్ట్ చూడటానికి వస్తారు. తిరుమల వేంకటేశ్వరుణ్ణి, మధుర మీనాక్షిని చూడటానికి వస్తారు. ఇక మీదట దేవుని ఆభరణాలను చూడటానికి వస్తే? దేశంలో ప్రస్తుతం 25000 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఒక అంచనా. ఇందులో ఐదు శాతం బంగారం మన గుడులలోనే ఉందట. ఈ బంగారం ఇవాళ్టిది నిన్నటిది కాదు. వందల ఏళ్లుగా భక్తులు ఆయా దేవుళ్లకు సమర్పించిన కానుకల్లో భాగంగా సురక్షితంగా ఉంది. పాతకాలం నాటి ఆ ఆభరణాలు, వాటి నైపుణ్యం, అందం, విలువ దర్శించడం కూడా ఒక విడ్డూరంగా ఉంటుంది.

ఉదాహరణకు తిరువనంతపురంలో నిక్షిప్తమైన విలువైన ఆభరణాలను ప్రదర్శనకు పెడితే ఈ దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి దర్శించరూ? అందుకే ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఈ వెసులుబాటును భారత్ పరిశీలిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తే కనుక దేవుని ఆభరణాలు ప్రదర్శనకు పెట్టవచ్చనే ఆలోచనతో ఈ రెండూ ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదొక విధానంగా అయితే మాత్రం దేవుడు ధరించే ఆభరణాలకు నమస్కారం పెట్టుకోవడానికి భక్తులు క్యూ కడతారనడంలో ఆశ్చర్యం లేదు.

మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!

మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!
న్యూఢిల్లీః మహిళల భద్రతకు భరోసాను కల్పిస్తూ కార్పన్ మొబైల్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి భద్రతా సామర్థ్యం కలిగిన పరికరాన్నిఅందించేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ దేశీయ మొబైల్ సంస్థ కార్బన్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేసే మొబైల్ ఎస్ ఓఎస్ అనువర్తనాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. 

వినియోగదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు, వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు అత్యవసర సందేశాలను పంపించేందుకు వీలుగా ఈ కొత్త సేఫ్టీ యాప్ పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ పై ఒక్కసారి టాప్ చేస్తే చాలు.. కుటుంబ సభ్యులు, ఇతర అత్యవసర కాంటాక్ట్ నెంబర్లకు సమాచారం నిమిషాల్లో అందిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా వారి లొకేషన్ ను కూడ ముందుగా షేర్ చేస్తే... అత్యవసర పరిస్థితుల్లో వారున్న ప్రదేశాన్ని సైతం గుర్తించేట్టుగా కార్బన్ మొబైల్ కొత్త ఫీచర్ ను అందిస్తోంది.

తాజా సదుపాయంతో వినియోగదారులు అలర్ట్స్ మాత్రమే కాక అలారం మోగించే అవకాశాన్ని కూడ కల్పిస్తోంది. మొబైల్ స్క్నీన్ లాక్ ను అన్ లాక్ చేయకుండా మొబైల్ ను  షేక్ చేస్తూ, పవర్ బటన్ ను నొక్కుతుంటే చాలు... అలర్ట్స్ తో పాటు, అలారం కూడ అందే సదుపాయం కార్బన్ కొత్త ఫీచర్ ద్వారా పరిచయం చేస్తోంది. 2017 జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా పానిక్ బటన్ ఇన్ స్టాల్ చేయాలన్న ప్రభుత్వ సూచనను కార్బన్ అమల్లోకి తెచ్చింది. దీనితోపాటు అన్నిఫోన్లలో జనవరి 2018 నాటికి తప్పనిసరిగా  ఇన్ బిల్ట్ జీపీఎస్ నేవిగేషన్ సిస్టమ్ ఉండాలని కూడ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలను హ్యండ్ సెట్ ఇండస్ట్రీ బాడీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) కూడ స్వాగతించింది.

99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ...................?



99 రూపాయలకే స్మార్ట్ ఫోన్

Others | Updated: May 18, 2016 16:41 (IST)
99 రూపాయలకే  స్మార్ట్ ఫోన్
బెంగళూరు: ప్రపంచంలోనే అతి  చవకైనా స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామంటూ నమోటెల్‌ డాట్‌కామ్‌ సంచలన ప్రకటన చేసింది. 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ  మొబైల్ ప్రియుల  గుండెల్లో  గుబులు పుట్టించింది.  అరుదైన రీతిలో 99 రూపాయలకే  అచ్చేదిన్ పేరిట స్మార్ట్‌ఫోన్‌ను పంపిణీ చేస్తామని బెంగళూరులో ప్రకటించింది. నగరంలో మంగళవారం నమోటెల్‌ కంపెనీ సీఈఓ మాధవరెడ్డి మీడియాకు ఈ వివరాలు ప్రకటించారు. మే 17న ప్రారంభమైన  బుకింగ్ లు మే 25 తో ముగుస్తాయని వెల్లడించారు.
తమ స్మార్ట్‌ఫోన్‌  కొనాలనుకునే వారు నమోటెల్. డాట్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్‌వర్డ్‌ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్‌ డాట్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్  చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డును జతచేస్తే స్మార్ట్‌ఫోన్‌ ను అందిస్తామన్నారు. బి మై బ్యాంకర్‌లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్‌లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు. బ్లాక్ అండ్ వైట్ రెండు రంగుల్లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్  ధరను  2వేల  రూపాయలను తగ్గించినట్టు  ప్రకటించింది.   కంపెనీ క్యాష్ ఆన్ డెలీవరీ సదుపాయం కూడా కల్పించినట్టు రెడ్డి  చెప్పారు.

దీని ఫీచర్స్  ఇలా ఉన్నాయి.
1.3 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1 జీబీ రామ్ , 3జీ
4 జీబీ రామ్
3 మెగా పిక్సెల్ ఫ్రంట్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
డ్యూయల్ సిమ్, 4 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే
1325 ఎంఏహెచ్ బ్యాటరీ

మనుషులనే పెయింటింగ్ చిత్రాలుగా మారిస్తే.. .....

నగ్నంగా మార్చి వారిపై చిత్రాలు గీసి..
బెర్లిన్: సాధారణంగా కాన్వాస్ పెయింట్స్ చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటాయి. అది అందరికీ అబ్బని ఓ చక్కటి కళ. ఈ పెయింటింగ్ తో ఎన్నో అద్భుతాలు, వింతలు సృష్టించి ఆకర్షించవచ్చు. సాధరణంగా ఈ పెయింట్స్ ను ఏ పేపర్ పైనో గోడపైనో వేస్తే పెద్దగా ఆసక్తి అనిపించకపోవచ్చేమోగానీ.. మనుషులనే పెయింటింగ్ చిత్రాలుగా మారిస్తే.. అది కూడా అరే.. నిజంగానే అటవీ జంతువులు దర్శనం ఇస్తున్నాయే అనేంత భ్రమపడేలా ఆ చిత్రాలు ఉంటే.. ! జర్మనీకి చెందిన ఓ పెయింటర్ అచ్చం ఇలాంటి పేయింట్స్ వేశారు.

జిసైన్ మార్ వెడెల్ అనే ఓ చిత్రకారురాలు నగ్నంగా ఉన్న మనుషులను ఆయా జంతువులు, పక్షులు, కీటకాలు, సముద్ర ప్రాణిలా ఆకారంలో మలచడంతోపాటు ఆ మేరకు వారిపై రంగులు వేసి అబ్బురపరిచింది. ఇలా పురుషులు, స్త్రీలపైన దాదాపు పన్నెండు గంటలపాటు ఆమె కష్టపడి పెయింట్స్ వేసి అనంతరం ఆ పెయింట్స్ ను ఓ చక్కటి ఫొటోగ్రాఫర్ తో క్లిక్ మనిపించింది. ఆ ఫొటోలు చూసిన వారంత ఆశ్చర్యపోయారు. ఒక కళను ఇలా కూడా ప్రదర్శించడం సాధ్యమా అని అనుకుంటున్నారు.

తాను ఇలా మనుషులపైనే పెయింటింగ్ వేయాలని ఆలోచించడమే ఆశ్చర్యంకాగా.. అది కూడా అత్యంత అరుదైన అటవీ జంతువుల బొమ్మలే చిత్రించి వాటిపట్ల మనుషులు కాస్తంత ఉదారంగా ఆలోచించేలా చిత్రాలు వేయడం గొప్ప విషయం. కాగా ఈ పెయింటింగ్స్ వేస్తున్నంత సేపు వారు తమకు మసాజ్ చేస్తున్నట్లుగా ఫీలయ్యారంట.