Monday 15 August 2016

143 ఖాళీలు

రాజ్యసభ సచివాలయంలో 143 ఖాళీలు

పార్లమెంట్‌లోని ఎగువ సభ (రాజ్యసభ) సచివాలయం వివిధ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో, ప్రజాప్రతినిధులు కొలువుదీరే పార్లమెంటులో ఉద్యోగం అంటే ప్రతిభను చాటుకునేందుకు పటిష్టమైన వేదికని చెప్పొచ్చు. మొత్తం ఖాళీలు 143. వాటి వివరాలు కేటగిరీల వారీగా..
Jobs
  1. జూనియర్ పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్ (4): ఇంగ్లిష్/హిందీ-1, అస్సామీ-1, మరాఠీ-1, ఉర్దూ-1. ఇందులో ఎస్టీ-1, ఓబీసీ-1, ఓసీ-2.
  2. జూనియర్ పార్లమెంటరీ రిపోర్టర్(8): హిందీ-4, ఇంగ్లిష్-4. ఇందులో ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-1, ఓసీ-5.
  3. సీనియర్ ఎగ్జిక్యూటివ్/లెజిస్లేటివ్/కమిటీ/ ప్రొటోకాల్ అసిస్టెంట్(23): ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-5, ఓసీ-12.
  4. రీసెర్చ్ అసిస్టెంట్(8): ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-1, ఓసీ-5
  5. ఇంగ్లిష్ స్టెనోగ్రాఫర్(6): ఎస్టీ-1, ఓబీసీ-2, ఓసీ-3 ఉన్నాయి.
  6. సెక్యూరిటీ అసిస్టెంట్(16): ఎస్సీ-2, ఓబీసీ-5, ఓసీ-9.
  7. జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్(2): వీటిని ఓసీలకు రిజర్వ్ చేశారు.
  8. జూనియర్ క్లర్క్(33): ఇంగ్లిష్-30, హిందీ-2, ఉర్దూ-1. ఇందులో ఎస్సీ-7, ఎస్టీ-2, ఓబీసీ-6, ఓసీ-18.
  9. ట్రాన్స్‌లేటర్(28): ఎస్సీ-4, ఎస్టీ-1, ఓబీసీ-7, ఓసీ-16.
  10. జూనియర్ ప్రూఫ్ రీడర్(13): ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఓసీ-7.
  11. స్టాఫ్ కార్ డ్రైవర్(2): ఓబీసీ-1, ఓసీ-1.

వేతనం

  • ఇంటర్‌ప్రిటర్, రిపోర్టర్లకు రూ.15,600-39,100 పేస్కేల్‌తోపాటు రూ.5400 గ్రేడ్ పే ఉంటుంది.
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.9300-34,800 పేస్కేల్‌తోపాటు రూ.4800 గ్రేడ్ పే చెల్లిస్తారు.
  • క్లర్క్, ప్రూఫ్ రీడర్, కార్ డ్రైవర్ పోస్టులకు రూ.5200-20,200 పేస్కేల్‌తోపాటు రూ.2800 గ్రేడ్‌పే ఇస్తారు.

విద్యార్హత - అనుభవం: పూర్తి వివరాల కోసం రాజ్యసభ వెబ్‌సైట్ చూడొచ్చు.
వయసు: 2016, ఆగస్టు 29 నాటికి ఇంటర్‌ప్రిటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు గరిష్ట వయసు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర దశల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ప్రతి దశలో సాధించాల్సిన కనీస మార్కులు, పరీక్షల సిలబస్ వంటి వివరాలను రాజ్యసభ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ఫీజు రూ.100, బ్యాంక్ చార్జీ రూ.60 చెల్లించాలి.
చివరి తేదీ: 2016 ఆగస్టు 29.
వెబ్‌సైట్:  www.rajyasabha.nic.in

No comments:

Post a Comment