Pages

Saturday, 19 March 2016

నేడు ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం


హైదరాబాద్ : ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్స వం సందర్భంగా ఆదివారం చార్మినార్ నుంచి జూపార్కు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ సుభద్రదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణ దళం ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు చార్మినార్ నుంచి సైకిల్, బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం ర్యాలీ జూ లోని వివిధ ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అదే విధంగా జూ సందర్శనకు వచ్చే వారందరికీ ఊర పిచ్చుకలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

No comments:

Post a Comment